లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు నిన్న సిద్దిపేటలో పర్యటించారు. పట్టణంలో పలువురు తమ ద్విచక్ర వాహనాలపై ఇద్దరు, ముగ్గురితో కలిసి తిరుగుతున్నవారిని ఆపారు. ఎంత బతిమిలాడి చెప్పినా అర్థం చేసుకోవట్లేదని మండిపడ్డారు. కరోనా వైరస్ కు మందే లేదు. స్వీయ నిర్బంధం, సామాజిక దూరం పాటించడమే మన ముందున్న ఏకైక పరిష్కారమని తెలిపారు.
ఈ వైరస్ ను చూసి ప్రపంచమే గడగడలాడుతోంది. మీరేమో పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు” అంటూ క్లాస్ పీకారు. వందలాది మంది అధికారులు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజల కోసం పని చేస్తుంటే, వారికి సహకరించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ప్రజలు తమ వైఖరిని మార్చుకోకపోతే కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారు: కన్నా