కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ లేదా సోనియా గాంధీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేదంటే కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం.
మంగళవారం సాయంత్రం ఏఐసీసీ ఆఫీస్ నుంచి కోమటిరెడ్డికి ఫోన్ వచ్చింది. ఇప్పటికే ఢిల్లీలో బట్టి విక్రమార్క, శ్రీధర్బాబు రెండు రోజుల క్రితం ఢిల్లీలో మకాం వేశారు.
అయితే.. మంగళవారం రాత్రే ఢిల్లీ నుంచి హైదరాబాద్కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దీంతో వీళ్లిద్దరి సమక్షంలోనే ప్రియాంక లేదంటే ముఖ్యనేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని బుజ్జగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.