ప్రధాని మోదీ అవంబిస్తున్న విధానాల వల్లే దేశంలో ఉగ్రవాదం పెరిగిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి గులాంనబీ అజాద్ అన్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై మండిపడ్డారు. మతపరమైన అంశాలను అడ్డం పెట్టుకుని కాషాయ దళం రాజకీయాలు చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ రాజకీయాలు దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ మంది జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో తామెప్పుడూ అభివృద్ధి గురించే మాట్లాడుతున్నామన్నారు. బీజేపీ నాయకులు మాత్రం అభివృద్ధి గురించి మాట్లాడకుండా దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. ఎన్నికల విధానాన్ని వేగవంతం చేసేందుకు ఈవీఎంలను కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందన్నారు. ఇప్పుడు ఈవీఎంలతో బీజేపీ ప్రభుత్వం మోసాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
మిషన్ బిల్డ్ పేరిట రాష్ట్రాన్ని అమ్మకానికి పెడుతున్నారు: అనురాధ