తెలంగాణలో ఓయు పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. సీపీజెట్లో 94.54 శాతంతో 74,815 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జెఎన్టీయూలో 2019-20 సంవత్సరానికి గాను పీజీ, డిప్లొమా, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు.
previous post