telugu navyamedia
సినిమా వార్తలు

కొండారెడ్డి బురుజు @ రామోజీ ఫిలింసిటీ…!!

Sarileru-nIkevvaru

ప్ర‌స్తుతం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ “స‌రిలేరు నీకెవ్వ‌రు” అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. “స‌రిలేరు నీకెవ్వ‌రు” చిత్రంలో మ‌హేష్ మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బండ్ల గ‌ణేష్‌, విజ‌య‌శాంతితో పాటు ప‌లువురు సినీ న‌టులు చిత్రంలో న‌టిస్తున్నారు. ర‌ష్మిక మందన్న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అయితే మ‌హేష్ బాబు తాజా చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రులోను త‌మ‌న్నా స్పెష‌ల్ డ్యాన్స్ చేస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా క‌ర్నూలు కొండారెడ్డి బురుజుని “సరిలేరు నీకెవ్వ‌రు” సినిమా కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో రీ క్రియేట్ చేశారు. సోమ‌వారం నుండి ఇక్క‌డ కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. దీని గురించి నిర్మాత అనీల్ సుంక‌ర ట్వీట్ చేశారు. “16 ఏళ్ల క్రితం కొండారెడ్డి బురుజు వెండితెర‌పై ఐకానిక్ లొకేష‌న్ అయ్యింది. ఈసారి దీన్ని మ‌రింత పెద్ద‌దిగా చేశాం. ఆర్ట్ డైరెక్ట‌ర్ ఎ.ఎస్‌.ప్రకాశ్ అద్భుతంగా త‌యారు చేశారు. కొండారెడ్డి బురుజుని రామోజీ ఫిలింసిటీకి తీసుకొచ్చారు” అన్నారు అనీల్ సుంక‌ర‌. ఈ సెట్ ముందు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ నిల‌బ‌డి ఉండే ఫొటోను కూడా షేర్ చేశారీయ‌న. మహేష్, అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం “సరిలేరు నీకెవ్వ‌రు”. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుద‌లవుతుంది.

Related posts