ప్రముఖ మొబాయిల్ తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ తన నోకియా 7.2 స్మార్ట్ఫోన్ను గత వారం భారత్లో విడుదల చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆ ఫోన్లను ఈ రోజు నుంచి అమ్మకాలు ప్రారంభించారు. ఇప్పటికే ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్తోపాటు నోకియా ఆన్లైన్ స్టోర్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ 7.2 స్మార్ట్ఫోన్ 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.18,599, రూ.19,599 ధరలకు వినియోగదారులకు లభిస్తాయి.
ఇక ఈ ఫోన్లో 6.3 ఇంచుల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను పొందుపరిచారు. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్ను కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్బ్యాక్ ఇస్తారు. జియో వినియోగదారులు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.7200 విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలోనూ ఈ ఫోన్ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు.