telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆసక్తికరంగా “ఎవరు” టీజర్

Evaru

“క్ష‌ణం” సినిమాతో ఊహించని సక్సెస్ ను అందుకున్నాడు హీరో అడవి శేష్. లిమిటెడ్ బడ్జెట్‌లో రూపొందించిన ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ఇప్పుడు మ‌రోసారి పివిపి సినిమా, హీరో అడివిశేష్ కాంబినేష‌న్‌లో ఓ థ్రిల్ల‌ర్ చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రానికి “ఎవ‌రు” అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. వెంక‌ట్ రామ్ జీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. ఈ చిత్రంలో అడివిశేష్ హీరోగా న‌టిస్తుండ‌గా, రెజీనా క‌సండ్ర హీరోయిన్‌గా న‌టిస్తుంది. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ చిత్రానికి వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ప్రీ లుక్ లో అడివి శేష్ విక్ర‌మ్ వ‌సుదేవ్ బ్యాడ్జ్‌తో కన్పించాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 15న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ టీజర్ అడివి శేష్ డైలాగులతో ఆసక్తికరంగా సాగుతోంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts