“రంగస్థలం” సినిమా తరువాత మహేష్ బాబు దర్శకత్వం వహించబోయే సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మహేష్ కోసం సుకుమార్ కథ తయారు చేసుకుంటున్నాడని, త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉండబోతోంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని మహేష్ బాబు ట్వీట్ ద్వారా ప్రకటించారు. ఈరోజు దర్శకుడు సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా ”మోస్ట్ హంబుల్, సూపర్ టాలెంటెడ్ సుకుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన సినిమా కోసం ఎదురుచూస్తున్నాను సర్” అంటూ ట్వీట్ చేశాడు మహేష్. అంటే వీరిద్దరి కాంబినేషన్ లో తరువాత సినిమా అనే విషయాన్ని మహేష్ బాబు ప్రకటించాడన్నమాట. గతంలో మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో “నేనొక్కడినే” అనే సినిమా తెరకెక్కి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మరి ఈసారైనా వీరి కాంబినేషన్ హిట్ కొడుతుందేమో చూడాలి.
Wishing the most humble & super talented @aryasukku a very happy birthday… May you have a great one!!!
Looking forward to starting our film sir 😊😊 pic.twitter.com/wgFDRq9gDQ— Mahesh Babu (@urstrulyMahesh) January 11, 2019
మరోవైపు సంక్రాంతి బరిలో వరుసగా విడుదలవుతున్న సినిమాలపై కూడా మహేష్ బాబు స్పందిస్తూ ట్వీట్ చేస్తున్నారు. “కథానాయకుడు” సినిమాకు అభినందనలు తెలియజేసిన ఆయన తాజాగా “పేటా” సినిమా టీంకు కూడా అభినందనలు తెలియజేశారు. తనలాంటి రజినీకాంత్ అభిమానులందరికీ ‘పేటా’ తో మంచి ట్రీట్ ఇచ్చిన తలైవాకి వందనాలు అని, మనకున్న అద్బుతమైన టాలెంటెడ్ దర్శకుల్లో కార్తిక్ సుబ్బరాజ్ ఒకరని, ఎప్పటిలాగే సినిమాటోగ్రాఫర్ తిరు అధ్బుత పనితనం కనబరిచారని త్వేట్ చేశారు మహేష్. ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో “మహర్షి” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో “మహర్షి” ప్రేక్షకుల ముందుకు రానుంది.
#Petta is a tribute to all the fans of @rajinikanth sir, including me… Only one word… Thalaiva…🙏 @karthiksubbaraj you are one of the finest talents we have 👍 @DOP_Tirru outstanding as always 👌 Congrats to the entire team…👏🏻👏🏻#Rajinified
— Mahesh Babu (@urstrulyMahesh) January 10, 2019
మగాళ్లను ద్వేషించే జాబితాలో లేను : శృతి హాసన్