telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇద్దరు భామలతో రొమాన్స్‌కు రెడీ అయిపోయిన మంచు విష్ణు..!

శ్రీను వైట్ల- మంచు విష్ణు కాంబినేషన్‌లో వచ్చిన “ఢీ” సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఆ సినిమాతో మంచు విష్ణు హీరోగా మంచి పేరు సంపాదించాడు. దీంతో అదే కాంబినేషన్‌ను మళ్లీ రిపీట్‌ చేయనున్నాడు విష్ణు. విష్ణు పుట్టిన రోజు సందర్భంగా తన నెక్ట్స్‌ మూవీని అనౌన్స్‌ చేశాడు విష్ణు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా “డబుల్‌ డోస్‌”{ఢీఢీ} మూవీని ప్రకటించారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి ఓ వార్త వైరల్‌ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇద్దరు పేర్లు అనుకుంటున్నారట శ్రీను వైట్ల. ప్రధాన కథానాయిక పాత్ర కోసం ఇమ్మాన్యుయేల్‌ లేదా ప్రగ్యా జైస్వాల్‌లో ఎవరో ఒకరిని మొదట అనుకున్నారట. అయితే.. తాజాగా దీనిపై ఓ వార్త వైరల్‌ అవుతోంది. మంచు విష్ణుతో ఇద్దరు భామలు రొమాన్స్‌ చేయనున్నారని టాక్‌. ఈ సినిమా కోసం అను ఎమ్మాన్యుయేల్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా అయితే… బాగుంటుందని ఈ సినిమా యూనిట్‌ భావిస్తోందట. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ ఇద్దరి భామలను చిత్ర యూనిట్‌ కలిసిందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Related posts