బీసీలలో అపోహలు తేవాలని వైసీపీ, టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మూడు పార్టీల కుట్రల పట్ల బిసిలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీసీలను టీడీపీకి దూరం చేసే కుతంత్రాలు పన్నుతున్నారని అన్నారు. వైసీపీ, టీఆర్ఎస్ లాలూచీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు టీడీపీ నేతలకు పిలుపు ఇచ్చారు.
గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డిని కేసీఆర్ నిందించారని, రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకంపై కేసీఆర్దే రెండో సంతకమని గుర్తు చేశారు. ఇప్పుడు అదే వైఎస్పై కేసీఆర్ పొగడ్తలు కురిపిస్తున్నారని విమర్శించారు. నిన్న అసెంబ్లీలో కేసీఆర్ వైఎస్ను పొగిడారన్నారు. జగన్తో కేటీఆర్ భేటీ అయి వారం రోజులు కూడా కాలేదని, జగన్ వెంటనే కేసీఆర్కు లేఖ రాశారన్నారు. మోదీ డైరెక్షన్లో టీఆర్ఎస్, వైసీపీ కలిశాయని చంద్రబాబు పేర్కొన్నారు.
ఫామ్ హౌస్, ప్రగతి భవన్, పబ్లిక్ మీటింగ్లకే..కేసీఆర్ పై పొన్నాల విమర్శలు