telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేస్తుంది: నితిన్‌ గడ్కరీ

modi is next pm said again gadkari
పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయవాడలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈబీసీ రిజర్వేషన్లు కల్పించినందుకు గడ్కరీని రాష్ట్ర బీజేపీ నేతలు సన్మానించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నితిన్ గడ్కరీ హాజరై మాట్లాడుతూ.. ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ అందించిన సాయం మరెవరూ అందించలేదని అన్నారు.  కేంద్రం అందించిన నిధుల నివేదికలను మేధావులు పరిశీలించాలని సూచించారు. 
అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చంద్రబాబుకు ధన దాహం, భూదాహం పట్టుకుందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన పథకాలతోనే కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకొని బీజేపీనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. మోదీ  భయంతో ఏం మాట్లాడుతున్నాడో చంద్రబాబుకు అర్థం కావడం లేదన్నారు. బీజేపీతో టీడీపీ విడిపోయిన తరువాతే రాష్ట్రానికి కేంద్రం 24 వేల కోట్ల నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు.

Related posts