తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ నీ ఆటలు సాగవని హెచ్చరించారు. జగన్ను అడ్డుపెట్టుకుని ఏపీని అతలాకుతలం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణలో హిట్లర్లా తయారయ్యాడని దుయ్యబట్టారు. ఏపీ మీద కేసీఆర్ పెత్తనం చేయాలనుకుంటున్నాడని విమర్శించారు.
కేసీఆర్ దౌర్జన్యాలను ఎదుర్కొనే శక్తి తనకు ఉందని చంద్రబాబు అన్నారు. ఇదంతా వైసీపీ కోసం కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా ఆయన ఆరోపించారు. ఓట్లు తీసేయడం జగన్కు కేసీఆర్ నేర్పించారని అన్నారు.కొంతమంది ఉదయం ఓ పార్టీలో సాయంత్రం మరో పార్టీలో ఉంటున్నారన్నారు. కొందరు నాయకులు అవకాశవాదంతో పార్టీలు మారినంత మాత్రాన జనం ఆలోచనలు మారుతాయా అని ఆయన ప్రశ్నించారు.
మార్చిలో కేటీఆర్ కు పట్టాభిషేకం…