telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అత్యాచార ఘటనలపై యోగికి మోదీ ఫోన్

modi yogi bjp

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో సామూహిక అత్యాచారానికి గురైన 20 ఏళ్ల యువతి ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అదే రాష్ట్రంలో ఒక వివాహితపై ఇద్దరు డ్రైవర్లు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ప్రధాని మోదీ ఈ రోజు ఫోన్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యోగిని ఆదేశించారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దని అన్నారు. మోదీ ఫోన్ చేసిన విషయాన్ని యోగి వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారని చెప్పారు. దీనిపై ముగ్గురు అధికారులతో ఓ ప్యానెల్ ఏర్పాటు చేశామని తెలిపారు.

Related posts