telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి.. గోడ కూలి నలుగురు మృతి

apcm and governor wishes on srikrishna

పశ్చిమ బెంగాల్‌లో ఈ రోజు నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. రాష్ట్రంలోని నార్త్ 24 పరగణ జిల్లాలో ని కచువాలోని ఓ ఆలయంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అకస్మాత్తుగా దేవాలయం ప్రహరీ గోడ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారం ప్రకటించారు.

Related posts