telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ముంబై : .. వరద తాకిడికి.. ఆనకట్టకు గండి.. 35మృతి, 23 గల్లంతు..

dam was smashed with rains in mumbai

నగరంలో వరదల తాకిడికి జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటికే 35మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు నిరాశ్రయులయ్యారు. ఈ తరుణంలోనే, మూలుగుతున్న నక్కమీద తాటిపండు పడ్డట్టుగా, భారీ వర్షాల కారణంగా ఆనకట్టకు గండిపడి వరద నీరు పోటెత్తడంతో 23 మంది గల్లంతయ్యారు.

రత్నగిరిలో ఉన్న తివారీ ఆనకట్టుకు గండి పడడంతో వరదనీరు ఒక్కసారిగా సమీపంలోని ఏడు గ్రామాలను ముంచెత్తింది. దీంతో 12 ఇళ్లు కొట్టుకుపోగా, పలువురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు మొదలుపెట్టాయి. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను వెలికి తీశాయి. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Related posts