telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తప్పు చేశారని తేలడంతోనే ఏసీబీ అరెస్ట్ చేసింది: రోజా

roja ycp mla

టీడీపీ నేత అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. ఆయన ఏదో స్వాతంత్ర్య సమరయోధుడిని అరెస్ట్ చేసినట్టు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని దూయాబట్టారు. తప్పు చేశారని తేలడంతోనే ఏసీబీ అరెస్ట్ చేసిందని చెప్పారు. అచ్చెన్నాయుడు వంటి అవినీతి తిమింగలాలు జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా తెలియకుండా అచ్చెన్నాయుడు వ్యవహారం నడిపారని, పలానా కంపెనీతో ఎంఓయూ చేసుకోవాలంటూ లెటర్ హెడ్ మీద సంతకాలు కూడా చేశారని చెప్పారు.

రూ. 150 కోట్ల అవినీతి జరిగిందని ఆధారాలతో సహా రుజువైందని అన్నారు. ఏడాది కాలంలో మీరు ఏం చేశారంటూ నారా లోకేశ్ తొడ కొట్టారని అన్నారు. ఇప్పుడు స్టార్ట్ అయిందని, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, అసలైన సినిమా ముందుందని చెప్పారు. అచ్చెన్నను అరెస్ట్ చేస్తే బీసీ నాయకుడిని అరెస్ట్ చేశారని గగ్గోలు పెడుతున్నారని, తప్పు చేసిన వారు బీసీనా, ఓసీనా అనేది ఉండదని… ఎవరైనా అనుభవించాల్సిందేనని రోజా చెప్పారు.

Related posts