మధ్య ప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని ఆరోపించింది. ముఖ్యమంత్రి కమల్నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం శాంతిభద్రతల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించింది. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది.
ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. నీముచ్ జిల్లా జైలు నుంచి నలుగురు ఖైదీలు తప్పించుకుని, పారిపోయిన నేపథ్యంలో బీజేపీ నేత రాకేశ్ సింగ్ మాట్లాడుతూ మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల గురించి పట్టించుకోవడం లేదన్నారు.