telugu navyamedia
రాజకీయ వార్తలు

శాంతిభద్రతల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: బీజేపీ

against bjp trying to apply last weapon as mp resigns

మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని ఆరోపించింది. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం శాంతిభద్రతల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించింది. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది.

ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. నీముచ్ జిల్లా జైలు నుంచి నలుగురు ఖైదీలు తప్పించుకుని, పారిపోయిన నేపథ్యంలో బీజేపీ నేత రాకేశ్ సింగ్ మాట్లాడుతూ మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల గురించి పట్టించుకోవడం లేదన్నారు.

Related posts