యోగా గురువు బాబా రాందేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడు ముస్లింలకు కూడా పూర్వీకుడేనని బాబా రాందేవ్ అన్నారు. శుక్రవారం ఖేడా జిల్లా నడియడ్లోని యోగ శిబిరంలో ఆయన మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం నిర్మించాలని గట్టిగా కోరుతున్నాని తెలిపారు.
అయోధ్యలో కాకుంటే మరెక్కడ నిర్మించాలి? దానిని మక్కా, మదీనా లేదా వాటికన్ సిటీలో నిర్మించలేమని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. హిందువులకు మాత్రమే కాదు, శ్రీరాముడు ముస్లింలకూ పూర్వీకుడే అని ఆయన వ్యాఖ్యానించారు. రామాలయ నిర్మాణం జాతికి గర్వ కారణమైన విషయం అని పేర్కొన్నారు.