పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్టుగా.. నిమ్స్ అంటేనే ఎంతో పేరున్న ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందొ మరోసారి బట్టబయలైంది. వైద్యం కోసం వచ్చిన మహిళ కు శస్త్ర చికిత్స చేసి, కడుపులోనే కత్తెర పెట్టేసి కుట్టేశారు. శస్త్రచికిత్స అనంతరం కూడా ఇబ్బందిగా ఉండటంతో మరోసారి ఆసుపత్రికి వచ్చిన ఆమె కడుపులో పరీక్షలు చేస్తుండగా కత్తెర కనిపించింది. దీనితో జరిగిన ఘోరాన్ని గ్రహించిన వైద్యులు మళ్ళీ శస్త్ర చికిత్స చేసి తొలగించడానికి పూనుకున్నారు.
ఈ విషయం తెలిసి రోగి బంధువులు, ఇతర రోగులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఎంతో పేరున్న ఆసుపత్రిలో ఇంతటి నిర్లక్ష్యం ఎలా చోటుచేసిందో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సదరు వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు.