శ్రీలంక ఎన్నికల కమిషన్ అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 16వ తేదీన నిర్వహిస్తామని ప్రకటించింది. ప్రస్తుత అధ్యక్షుడి పదవీ కాలం ముగియటానికి రెండు నెలల ముందే ఎన్నికల తేదీని ప్రకటించటం విశేషం. అభ్యర్థులు తమ నామినేషన్లను అక్టోబర్ 7వ తేదీ లోగా దాఖలు చేయాలని ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్లో సూచించింది. అధికార యునైటెడ్ నేషనల్ పార్టీ (యుఎన్పి) తరపున ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమసింఘె పేరును ఆ పార్టీ ప్రతిపాదిస్తుండగా ప్రధాన ప్రతిపక్షం తమ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే సోదరుడు, మాజీ రక్షణ మంత్రి గొటబాయ రాపక్సేను ప్రకటించింది.
మైనారిటీ జనతా విముక్తి పెరమున (జెవిపి) పార్టీ అనురకుమార దిశనాయకెను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 18 మంది అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం వున్నట్లు ఎన్నికల కమిషన్ అధికారులను ఉటంకిస్తూ స్థానిక మీడియా వెల్లడించింది.