telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భర్త గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించిన ప్రియమణి

Priyamani

హీరోయిన్ ప్రియమణి దక్షిణాది సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితమే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ‘రావణ్’ సినిమాతో హిందీ చిత్రసీమలోనూ అడుగు పెట్టింది. విభిన్నమైన పాత్రలతో అలరించిన ఆమె పెళ్లి తర్వాత కూడా అదే జోష్ కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో ”విరాటపర్వం, నారప్ప” సినిమాల్లో నటిస్తున్న ప్రియమణి… ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన భర్త ముస్తఫా రాజ్ గురించిన ఆసక్తికర విషయాలు చెప్పింది. నా మొగుడు బంగారం అంటూ తెగ మురిసిపోయిన ప్రియమణి, ఆయన కారణంగానే ఇంకా సినిమాల్లో నటిస్తూ మీ అందరినీ అలరిస్తున్నానని చెప్పింది. హీరోయిన్లకు పెళ్లి తర్వాత భర్త సహకారం, అంగీకారం లేదంటే సినిమాల్లో నటించడం కుదరదు.. కానీ ఆ విషయంలో తాను అదృష్ట వంతురాలినని, తనను అర్థం చేసుకునే భర్త దొరికాడని ఆమె చెప్పుకొచ్చింది. అందుకే పెళ్లైన మూడో రోజునే షూటింగ్ స్పాట్‌కి వెళ్లగలిగానని తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా ఆయనతో బోలెడంత సమయం గడిపానని చెప్పిన ఆమె కుటుంబ జీవితం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ముంబై డేట్స్ విషయం కూడా తన భర్తనే స్వయంగా చూసుకుంటారని ఆమె తెలిపింది.

Related posts