పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ఈరోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. 17వ లోక్సభకు ఎంపికైన అభ్యర్థులను ఆయన అభినందించారు. యువత పెద్ద సంఖ్యలో ఈ సారి ఓటింగ్లో పాల్గొన్నారని అన్నారు. ప్రస్తుత లోక్సభకు ఎన్నిక అయిన వారిలో సగం కన్నా ఎక్కువ మంది మొదటిసారి ఎన్నికైనట్లు ఆయన తెలిపారు.
78 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారని, ఇది అసాధారణ విషయమన్నారు. ఇది నవ భారత్కు సంకేతంగా నిలుస్తుందన్నారు. తాజా ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన మెజారిటీని ఇచ్చారన్నారు. సుమారు 61 కోట్ల మంది పౌరులు ఓటింగ్లో పాల్గొన్నట్లు చెప్పారు. ఇదో సరికొత్త రికార్డు అన్నారు. సబక్ సాత్, సబ్కా వికాస్ కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.