దేశ రాజధాని ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటానికి అనుమతికి కేంద్రం నిరాకరించింది. స్వాతంత్ర్య ఉద్యమం, మహాత్మా గాంధీ జీవితం ఇతివృత్తాలతో కూడిన శకటం తయారు చేయాలంటూ రాష్ట్రానికి కేంద్రం సూచించింది. అధికారులు ఎంతో కష్టపడి విజయవాడ గాంధీ కొండ, స్థూపం, ఏపీలో స్వాతంత్ర్య ఉద్యమ ఇతివృత్తంతో శకటం సిద్ధం చేశారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఢిల్లీ వీధుల్లో నడిపించాలని భావించిన శకటాన్ని కేంద్రం ఆమోదించలేదు. మొదట ఈ శకటం బాగుందన్న కేంద్ర అధికారులు..చివరి నిమిషంలో శకటానికి కేంద్ర రక్షణశాఖ అనుమతి నిరాకరించడంతో ఏపీలోని రాజకీయ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జనవరి 26న ప్రదర్శనకు ఏపీ శకటాన్ని వద్దనడం తమకు బాధను కలిగించిందని ఏపీ భవన్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.