ఏపీలో నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో ముగ్గురిని ప్రభుత్వ విప్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సామినేని ఉదయభాను(జగ్గయ్యపేట), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం) లకు ప్రభుత్వ విప్లుగా అవకాశం కల్పించారు.
ఇప్పటివరకు చీఫ్ విప్గా శ్రీకాంత్రెడ్డి ముత్యాలనాయుడు(మాడుగుల), దాడిశెట్టి రాజా(తుని), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(చంద్రగిరి), శ్రీనివాసులు (రైల్వే కోడూరు)విప్లుగా నియమితులైన విషయం తెలిసిందే. కొలుసు పార్థసారధిని విప్ బాధ్యతల నుంచి తొలగించారు.