telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల…

ఈరోజు ఏపీ కొత్త ఎస్‌ఈసీగా నీలం సాహ్ని ప్రమాణస్వీకారం చేయగా.. తాజాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఇక, ఏప్రిల్ 8వ తేదీన పరిషత్ ఎన్నికలు జరగనుండగా…9న అవసరమైన చోట రీపోలింగ్ జరుగుతుంది. 10వ తేదీన కౌంటింగ్, ఫలితాల వెలువడనున్నాయి.. కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని ప్రమాణస్వీకారం చేసినవెంటనే… పెండింగ్ లో ఉన్న పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగియగా.. ఇప్పుటుడు అందరి దృష్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైనే పడింది. కాగా, తన హయాంలో ఎన్నికలు నిర్వించలేకపోతున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త ఎస్ఈసీ ఆధ్వర్యంలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈసారి ఈ ఎన్నికలను బహిష్కరిస్తాము అని టీడీపీ తెలిపింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts