రౌడీ షీటర్గా పేరొందిన వరిసూరి సెల్వం అనే వ్యక్తి తమిళనాడులోని మధురైలో ని అత్తివరదర స్వామి దర్శనానికి ఒంటి నిండా బంగారం ధరించి వచ్చాడు. దీనితో ఆయనకు పోలీసులు రాజమర్యాదలతో స్వామి వారి దర్శనంతో పాటు ప్రత్యేక పూజలు చేయించారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వరిసూరి సెల్వంపై ఏకంగా 14కేసులున్నాయి. హత్య, బెదిరింపులు, హత్యాయత్నం వంటి కేసుల్లో అతడు ప్రధాననిందితుడిగా ఉన్నాడు. ఈయన గారికి మరో పిచ్చి ఉంది. ఒండినిండా బంగారం వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇలా ఒండి నిండా బంగారంతో తాజాగా అత్తివరదర స్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో పోలీసులు పక్కనుండి మరీ రాచమర్యాదలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
video source : tv9