telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కరోనా కారణంగా మరణించిన టీడీపీ సీనియర్ నేత…

మన దేశాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. గత నేలగ మళ్ళీ ఇప్పుడు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే దేశంలో మాత్రమే కాకుండా తెలుగురాష్ట్రాల్లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నడకుదిటి నరసింహారావు కరోనాతో మృతిచెందారు. గత కొంతకాలం క్రితం కరోనాబారినపడిన ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఇవాళ సాయంత్రం కన్నుమూశారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు నరసింహారావు.. మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకు చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కింది. ఇక, ఆయన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మామ కూడా.. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. అయితే ఇప్పటికే మన దేశంలో కరోనా కారణంగా చాలా మంది రాజకీయనాకులు మరణించారు.

Related posts