telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దీక్ష సమయంలో చింతమడకలో పొయ్యి వెలగలేదు: హరీష్ రావు

Ryathu bandhu amount Rs. 10000 in future

కేసీఆర్‌ ఆమరణ దీక్ష సమయంలో చింతమడకలో ఒక్క ఇంట్లోనూ పొయ్యి వెలగలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు చింతమడక బాసటగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాకతో చింతలేని గ్రామంగా చింతమడక మారుతుందన్నారు. కేసీఆర్‌ చింతమడక పర్యటన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో హరీష్‌ రావు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామన్నారు.

ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణం చేయిస్తామన్నారు. చింతమడక పరిసర గ్రామాలకు రహదారులు కావాలని విజ్ఞప్తులు అందాయి. చింతమడకలో అభివృద్ధి పనుల కోసం రూ. 10 కోట్లు ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నిధుల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట పట్టణంలో మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నానని హరీష్‌ రావు పేర్కొన్నారు.

Related posts