telugu navyamedia
రాజకీయ వార్తలు

తమ దేశంపై భారత్ వ్యతిరేక ప్రచారం: పాక్ ఫైర్

imran pakistan pm

తమ దేశంపై భారత్ వ్యతిరేక ప్రచారం చేస్తోందని పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జమ్మూ కశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ మంగళవారం నాడు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సహా మరో 19 మందిపై చార్జ్ షీట్ ను దాఖలు చేసింది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఘాటుగా స్పందించింది. అంతర్జాతీయ సమాజం ముందు తమ దేశాన్ని ముద్దాయిగా చూపించేందుకు భారత్ కొంటె ప్రయత్నం చేస్తోందని పాక్ ఆరోపించింది. ఛార్జి షీట్ లో పేర్కొన్న ఆధారాలను నిరూపించడంలో భారత్ విఫలమైందని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ సంకుచిత మనస్తత్వానికి ఇదొక నిదర్శనమని చెప్పింది. వారి స్వప్రయోజనాల కోసమే భారత్ ఇలాంటి చర్యలకు దిగుతోందని దుయ్యబట్టింది. అధికార పార్టీ బీజేపీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఛార్జ్ షీట్ ను రూపొందించారని పాకిస్తాన్ ఆరోపించింది.

Related posts