telugu navyamedia
రాజకీయ వార్తలు

పరవాడ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ ఆరా!

cm jagan ycp

విశాఖపట్టణం ప్రాంతంలోని పరవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్‌ ఫార్మా కంపెనీలో జరిగిన గ్యాస్ లీకైన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

మరో ఈ ఘటనలో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్, ఎస్పీలు ముందు జాగ్రత్త చర్యగా పరిశ్రమను మూసివేయించారు. గ్యాస్ లీక్ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు పోలీసులు తెలిపారు.

Related posts