విశాఖపట్టణం ప్రాంతంలోని పరవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో జరిగిన గ్యాస్ లీకైన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
మరో ఈ ఘటనలో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్, ఎస్పీలు ముందు జాగ్రత్త చర్యగా పరిశ్రమను మూసివేయించారు. గ్యాస్ లీక్ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు పోలీసులు తెలిపారు.