telugu navyamedia
క్రైమ్ వార్తలు

భర్తతో విసిగిపోయిన భార్య ..సుపారీ ఇచ్చి హత్య

ఓ భార్య భర్తను అతి దారుణంగా హత్య చేయించింది..ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ కొత్త కల్లివానిపాలెంలో మంగళవారం అర్ధరాత్రి ఆటో డ్రైవ‌ర్‌ పిల్లి పైడిరాజు (38) దారుణ హ‌త్య‌ జరిగింది. ఈ కేసును ఆనందపురం పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆనందపురం సీఐ వై.రవి గురువారం ఈ కేసుకు సంబంధించి విలేకరులకు ఇచ్చిన సమాచారం మేరకు.. అతని భార్య‌ ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న అప్పలకొండమ్మ (33), తమ్ముడు కొల్లి శ్రీనివాస్ (23) సహాయంతో హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలింది.

వివ‌రాల్లోకి వెళితే..

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని కొత్త కల్లివానిపాలెం గ్రామానికి చెందిన పైడిరాజుకు.. సరిగ్గా 15 ఏళ్ల కిందట అప్పలకొండమ్మతో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మొదట సరదగా మద్యం తాగే పైడిరాజు.. తరువాత ఆ మద్యానికి బానిస అయ్యాడు. దానికి తోడు మత్తుకు అలవాటు పడి.. గంజాయి తరచూ సేవిస్తూండే వాడు.. అలా తనకంటూ ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏర్పాడిన స్నేహితులను ఇంటికి పిలిపించుకుని.. భార్యతోనే ఇంట్లో సేవలు చేయించుకునే వాడు.. తన స్నేహితుల ముందే ఆమెను మోకాళ్లపై నిలబెట్టడం.. అర్థరాత్రి కూడా గాంజాయి పీల్చే స్నేహితులను ఇంటికి పిలిచి.. వారికి కూడా ఆమెతో సేవ‌లు చేయించేవాడు.. ఇలా మత్తుకు బానిస అయిన పైడిరాజు భార్యను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. ఇలాంటివాటితో సరిపెట్టుకోకుండా.. ఊర్లో అందరితో గొడవ పడుతూ… కట్టుకున్న ఇల్లాలికి, కుటుంబానికి మనశ్శాంతి లేకుండా ప్రవర్తించేవాడు. గంజాయి మత్తులో విచక్షణ మరచి తల్లి, భార్య, బిడ్డలు అన్న తేడా లేకుండా కొట్టేవాడు.

భర్త వేధింపులు రెట్టింపు అవ్వడం.. గంజాయి పీల్చే వారికి కూడా తనతో సపర్యలు చేయించడం.. వారు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె పూర్తిగా విసుగు చెందింది. దీంతో తన భర్తను చంపేయాలని నిర్ణయించింది. ఆలోచన వచ్చిన వెంటనే.. కిరాయి హంతకులతో సుపారీ మాట్లాడుకుని దారుణంగా హత మార్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.

Related posts