ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడ లో సంచలనం సృష్టించిన మహిళ, 15 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. ఈ నెల 19న 15 ఏళ్ల మైనర్ బాలుడితో పాటు.. అతడి ఇంటి ఎదురుగా నివాసం ఉండే వివాహిత మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి
వివారాల్లోకి వెళితే..
గుడివాడ గుడ్మెన్ పేటలో ఆమె పేరు స్వప్న ,వయసు 28 ఏళ్లు ..ఆమెకు పెళ్లై పిల్లలు ఉన్నారు. కానీ భర్తకు అనారోగ్య సమస్యలు ఉండటంతో.. అతను వేరే చోట ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆమె మనసులో తప్పుడు ఆలోచనలు బలపడ్డాయి. ఎదురింట్లో నివాసం ఉంటున్న 15 ఏళ్ల బాలుడిపై ఆమె కన్నేసింది. ముందుగా బాలుడిని పరిచయం చేసుకుని.. అతడితో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది. ఆ బాలుడు బాగా దగ్గరవడంతో ఫొన్లో పోర్న్ వీడియోలు చూపించి.. శారీరక సంబంధం ఏర్పరచుకుంది. ఎవరికి తెలియకుండా నెలరోజుల పాటు దీనిని కొనసాగించింది. ఎవరికైనా అనుమానం వస్తుందనే భయంతో పిల్లాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఆ క్రమంలోనే బాలుడికి మాయమాటలు చెప్పి.. హైదారాబాద్ తీసుకెళ్లింది. పిల్లాడు కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారుసెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా.. వారు హైదరాబాద్ బాలానగర్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించి.. స్వప్నపై పోక్సో చట్టం, కిడ్నాప్ కేసు నమోదు చేశాం’ అని టూ టౌన్ సీఐ దుర్గారావు తెలిపారు.