ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్థానాలు పెంపు కేంద్రం స్పష్టత..
2026 వరకు సీట్ల పెంపు ఉండదని కేంద్రం హొంశాఖ వెల్లడి..
అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే రాజ్యంగ సవరణ అవసరం..
2026 జనభా లెక్కలు వరకు వేచి ఉండాల్సిందే..
ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం స్పష్టతనిచ్చింది. 2026 వరకు వేచి చూడాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు అసెంబ్లీ స్థాలన పెంపుపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు బుధవారం కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.
అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే.. రాజ్యాంగ సవరణ అవసరం. అంతవరకు సీట్ల సంఖ్యను పెంచలేమని కేంద్రం స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి.. ఏపీలో 225, తెలంగాణలో 153 స్థానాలకు పెరుగుతాయని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు.
ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపు జరగాలంటే 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాలని కేంద్రం తెలిపింది. కిందటి ఏడాది ఎంపీ రేవంత్ రెడ్డి సైతం ఇదే ప్రశ్నకు అడగ్గా.. ఇదే మంత్రి.. ఇదే సమాధానం ఇచ్చారు.