telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. ఉరవకొండ మండలం బుదగవి వద్ద ఇన్నోవా కారును కంటైనర్ లారీ ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

బళ్లారిలో వివాహ వేడుకకు హాజరై తిరిగి కారులో అనంతపురానికి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఢీకొట్టిన తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. చూడటానికే ఒళ్లు గగుర్పొడిచేలా మృతదేహాలు ఛిద్రమయ్యాయి.

ఈ ఘటనతో బాధిత కుటుంబసభ్యులు పెను విషాదంలో మునిగిపోయారు. మృతులు ఉరవకొండ మండలం నిమ్మగల్లు వాసులుగా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన కుటుంబసభ్యులు, బంధువులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా 8 మంది మృతి చెందారు. ఈ  ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. .

Related posts