బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ కేసుపై సీబీఐ లోతుగా విచారణ జరుపుతున్న క్రమంలో రోజుకో కొత్త ట్విస్ట్ బయటకొస్తోంది. తాజాగా సుశాంత్ మృతి నేపధ్యంలో డ్రగ్స్ కోణాన్ని దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ పోలీసులు ఇవాళ ముంబైలో రియాని అరెస్టు చేశారు. గత నాలుగు రోజుల నుంచి రియాను ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో తనకు డ్రగ్స్ అలవాటు ఉందని రియా ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా కూడా ఈ ఉచ్చులో చిక్కుకుందని తెలుస్తుంది. కంగనా రనౌత్కు డ్రగ్స్ అలవాటు ఉందనే విషయమై విచారణకు ఆదేశించినట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ తెలిపారు. దీనిపై స్పందించిన కంగనా కంగనా రనౌత్ ముంబయి పోలీసులను, మహా సర్కారుకు సవాల్ విసిరింది. హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్, ముంబయి పోలీసుల ఆదేశాలను సంతోషంగా స్వీకరిస్తానని తెలిపారు. కావాలంటే తనకు డ్రగ్ టెస్టులు చేసుకోవచ్చని, తన కాల్ రికార్డులు పరిశీలించుకోవచ్చని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల విక్రేతలతో తనకు సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే తన తప్పును అంగీకరించి ముంబయిని శాశ్వతంగా విడిచి వెళ్లిపోతానని స్పష్టం చేశారు. త్వరలోనే ముంబయి పోలీసులను, హోంమంత్రిని కలిసేందుకు ఎదురు చూస్తున్నానని కంగనా వెల్లడించారు.
previous post