లెజెండరీ సింగర్, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 11న ఆసుపత్రిలో చేరిన ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్సను అందజేస్తున్నారు. బాలు ఆరోగ్యంపై ఆయన తనయుడు ప్రతిరోజు సమాచారం అందిస్తూ ఉన్నారు. కాగా నిన్న నిర్వహించిన వైద్య పరీక్షల్లో బాలుకు కరోనా నెగెటివ్ వచ్చిందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో ఇంకా ఇన్ఫెక్షన్ ఉన్నందున వెంటిలేటర్ పై చికిత్స మరికొంతకాలం కొనసాగించాల్సి ఉందని తెలిపారు. బాలు కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన కోలుకోవాలని సెలబ్రెటీలు, సంగీత ప్రేమికులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్దిస్తూనే ఉన్నారు.
previous post