చైనాకు చెందిన ‘ఫార్చ్యూన్ హీరో’ కార్గో షిప్ విశాఖ పోర్ట్ కు చేరుకుంది. ఆ కార్గో షిప్లో మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. 17 మంది చైనా, ఐదుగురు మయన్మార్ వాసులు ఉన్నారు. వీరికి కాగా కరోనా సోకిందన్న అనుమానంతో తీరానికి అనుమతించలేదు.
కరోనా వైరస్ నేపథ్యంలో షిప్ను పోర్టుకి దూరంగా నిలిపివేశారు. డాక్టర్లు షిప్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.వైద్య పరీక్షల అనంతరం ఈ షిప్ కు అనుమతిస్తారా.. తిరిగి వెనకకు పంపిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.