గత కొన్ని రోజులుగా సినిమా టిక్కెట్ల రేటు విషయంలో ప్రభుత్వం వర్సెస్ చిత్రపరిశ్రమగా కొనసాగుతుంది. సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది.
తమ సమస్యలను ఏపీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం సమావేశమయ్యారు.
ముఖ్యంగా సినిమా టికెట్ ధరల తగ్గింపు, థియేటర్ల ఇబ్బందులపై మంత్రితో వీరు చర్చించారు. గంటన్నర పాటు వీరి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 19 మంది డిస్ట్రిబ్యూటర్లతో పాటు ఎఫ్డీసీ చైర్మన్ విజయకుమార్ రెడ్డి హాజరయ్యారు.
హెల్త్ బులెటిన్కు, వెబ్సైట్లో లెక్కలకు పొంతన లేదు: దేవినేని