ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభ మ్యాచ్లో బెంగళూరు 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలుపొందింది. చెపాక్వేదికగా ఆడిన గత ఐదు మ్యాచ్ల్లో ఓటమి పాలైన కోహ్లీసేన ఈసారి మాత్రం బోణీ కొట్టింది. ఈ మ్యాచ్ విజయానంతరం బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ‘ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి హర్షల్ పటేల్ను మేం కొనుగోలు చేశాం. తనదైన ప్రణాళికలతో, జట్టు తనపై పెట్టిన బాధ్యతను నెరవేర్చడంలో సక్సెస్ అయ్యాడు. ఈ మ్యాచ్లో తను ఎంతో ప్రత్యేకంగా నిలిచాడు. డెత్ ఓవర్లలో తన సేవలు చక్కగా వినియోగించుకుంటాం. ఒక కెప్టెన్గా తన నుంచి నేనేం ఆశించానో.. ఆ అంచనాలను తను అందుకున్నాడు. హర్షల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, డెత్ ఓవర్ బౌలర్గా తనను సీజన్ మొత్తం కొనసాగిస్తామని పేర్కొన్నాడు. జెమీసన్, చహల్, సిరాజ్ సైతం బాగా బౌలింగ్ చేశారు’ అని అన్నాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచులో హర్షల్ పటేల్ అద్భుతం చేశాడు. ముంబైపై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా అరుదైన ఘనత సాధించాడు.
previous post

