పోలవరం పాజెక్ట్ అంచనాలను ఎలా తగ్గిస్తారో చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యల పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఉమ వ్యాఖ్యలు వింటుంటే, దొంగే తనను పట్టుకోవాలని పోలీసులకు సవాల్ విసిరినట్టుందని తన ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. “పోలవరం పనుల అంచనాలను ఎలా తగ్గిస్తారో చెప్పాలని మాజీ మంత్రి ఉమా అనడం, దమ్ముంటే తనను పట్టుకోమని దొంగ పోలీసులకు సవాలు విసిరినట్టుగా ఉందన్నారు.
పోలవరం పనులు మొదలైనప్పటీ నుంచి ప్రాజెక్టును ఐదేళ్ళు ఏటీఎంలాగా వాడుకున్నారు. మీ దోపిడీలన్నీ బయటకొస్తాయి. ఎవరూ తప్పించుకోలేరు ఉమా” అని హెచ్చరించారు. ప్రజావేదిక ప్రభుత్వ నిధులతో నిర్మించిన సదుపాయం. చంద్రబాబు దానిని పార్టీ కార్యక్రమాలకు వాడుతున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్సుకు సిద్ధం చేస్తుంటే బాబు లేనపుడు తాళాలు తీస్తారా అంటూ ఆ పార్టీ నాయకులు డ్రామాలాడటం పరువు తీసుకోవడమేనని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
టీడీపీకి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ముఖ్యం: మంత్రి కన్నబాబు