కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని విజయసాయి చెప్పారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు. అన్ని ముందస్తు జాగ్రత్తలను సూచిస్తోందని చెబుతూ ట్వీట్ చేశారు.
‘అసెంబ్లీ, రెవెన్యూ డివిజన్, జిల్లా స్థాయి వరకు మూడంచెల్లో ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ ఏర్పాట్లు చేసిన ఘనత ఏపీ ప్రభుత్వానిదే అని చెప్పుకొచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారందరిని వైద్యులు పరీక్షించి ఐసోలేషన్ లో ఉంచడం, స్వల్ప లక్షణాలు కన్పించినా టెస్టులు చేస్తూ ప్రభుత్వ ముందస్తు జాగ్రత్తలను చేపట్టిందని తెలిపారు.