telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

భర్తను చంపి పోలీసులకు లొంగిపోయిన భార్య.. అసలు కారణం..

భార్య భర్తల మధ్య గొడవలు రావడం సహజమే కానీ వాటిని పెంచుకుంటూ పోతే మరింత పెరుగుతాయి.. అందుకే ఇద్దరిలో ఎవరోకరు తగ్గాలని చెబుతున్నారు. అసలు విషయానికొస్తే .. తాగుడుకు బానిసైన భర్త వేధింపులు భరించలేక దారుణంగా చంపేసింది.. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.. జిల్లాలోని కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లెకు చెందిన కళావతికి 17ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. మద్యానికి బానిసైన లక్ష్మయ్య రోజూ తాగి గొడవ పడేవాడు. ఇంటిల్లి పాదిని అనేక ఇబ్బందులకు గురిచేసే వాడు.భార్యను చిత్ర హింసలు పెట్టేవాడు.

భరించలేని భార్య పుట్టింటికి వెళ్లింది. అక్కడకు కూడా పుల్లగా తాగొచ్చిన భర్త పిల్లలను , భార్యను కొట్టాడు. అడ్డుగా వచ్చిన అత్తను కూడా కొట్టాడు. దాంతో అత్త పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు దేహశుద్ది చేశారు. అనంతరం భార్య వద్దకు కత్తితో వెళ్లి దాడి చేశాడు. భర్తను కట్టేసిన భార్య కర్రతో గట్టిగా కొట్టింది. తర్వాత కత్తితో గొంతులో పొడిచింది. కత్తితో నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి భర్తను చంపింది తానే అని లొంగిపోయింది.

Related posts