telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే 150 అసెంబ్లీ స్థానాలు వైసీపీవే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే వైసీపీ 150కి పైగా స్థానాలను గెలుచుకుంటుందని విజయసాయిరెడ్డి తెలిపారు. అందులో19 ఎంపీ, 133 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే సత్తా వుందని ఇండియా టీవీ దేశ్ కీ ఆవాజ్ సర్వే స్పష్టం చేస్తోందన్నారు.

అయితే రానున్న 20 నెలల కాలంలో వైసీపీ నేతలు గడప గడపకు తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించగలిగితే 150కి పైగా స్థానాలను సాధించడం పెద్ద కష్టమేమీ కాదని విజయసాయిరెడ్డి అన్నారు.

ఇటీవల ఇండియా టీవీ నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 19 పార్లమెంటు స్థానాలు, టీడీపీకి ఆరు లోక్ సభ స్థానాల్లో గెలుస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Related posts