కోలీవుడ్ హీరో మాధవన్ నటించిన తాజా చిత్రం రాకెట్రీ. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో రిలీజై బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్ళు రాబేడుతుంది..ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ మూవీకి సూపర్ స్టార్ రజినీ కాంత్ సైతం ఫిదా అయ్యారు. నంబి నారాయణ్ బయోపిక్లో మాధవన్ డైరెక్టర్గా యాక్టర్గా సక్సెస్ అయ్యాడని రజనీకాంత్ మెచ్చుకున్నారు.
1994లో ఇస్రో శాస్త్రవేత్తగా ఉన్న నంబీ నారాయణ్పై కుట్ర, దోశ ద్రోహుడిగా ముద్ర వేసిన ఘటనను కళ్ళకు కట్టినట్లు చూపించిన మాధవన్పై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం మాధవన్కు, నంబీ నారాయణ్ కు శాలువా కప్పి సత్కరించాడు.
ఈ ఆనందకర క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు మాధవన్.’ ఒక లెజెండ్ ఆధ్వర్యంలో మేము వన్ మ్యాన్ ఇండస్ట్రీ, లెజెండ్ రజనీకాంత్ నుంచి ఆశీర్వాదాలు తీసుకోవడం మర్చిపోలేను’..మీ మంచి మనసుకు ధన్యావాదాలు రజనీకాంత్ సార్..మీ మోటివేషన్ మాలో పునర్జీవాన్ని నింపింది ప్రపంచం మాదిరిగానే మేము మిమ్నల్ని ప్రేమిస్తున్నాము అంటూ రాసుకొచ్చారు.
ఈ వీడియోలో రజనీకాంత్ పాదాలను తాకి ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు. ప్రస్తుతం రాకెట్రీ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రేమ పాజిటివ్ గా ఉండాలి… వికృత రూపంలో కాదు : హరీష్ రావు