ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతి చెందారు. రాష్ట్రంలోని ఎతవాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొనడంతో ఆరుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతులు పనస పండ్లను ట్రక్కులో మార్కెట్కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సైఫాయి మెడికల్ కాలేజీకి తరలించారు.
ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పరిహారం ఇస్తున్నట్లు సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది.