telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

యూపీలో ఇద్దరు మంత్రులకు కరోనా

Corona

ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో అక్కడ కేసుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్రంలో ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి రాజేంద్ర ప్రతాప్‌ సింగ్‌తో పాటు ఆయన భార్య, కొడుకు, కోడలు, మనవరాళ్లకు కరోనా సోకింది. చికిత్స నిమిత్తం మంత్రితో పాటు ఆయన కుటుంబసభ్యులు సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చేరారు.

ఆదేవిధంగా ఆయూష్‌ శాఖ మంత్రి ధరమ్‌ సింగ్‌ సైనీ కూడా కరోనా బారినపడ్డారు. దగ్గుతో బాధపడుతున్న ధరమ్‌సింగ్‌కు పరీక్ష చేయగా కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ధరమ్‌సింగ్‌ పిలాఖిని మెడికల్‌ కాలేజ్‌లో చేరారు. మంత్రితో కాంటాక్ట్‌ అయిన 27 మంది శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపించారు.

Related posts