ఏపీ సీఎం జగన్ తన మిత్రుడు రాజశేఖర్ రెడ్డి కుమారుడని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. జగన్ తో తనకు ఎక్కువ చనువు లేకపోయినప్పటికీ ఆయన తనతో ఎప్పుడూ గౌరవంగానే ఉంటారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా జగన్ తనతో మంచిగానే ఉన్నారని చెప్పారు. తనకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ద్వేషం లేదని ఉండవల్లి పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును తాను కలిసేంతర వరకు తామిద్దరం ప్రత్యర్థులమేనని, ఆయనను కలిసిన తర్వాత తనకు ఇవాళ ఆయనపై ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని చెప్పారు. చంద్రబాబుతో తాను గడిపిన గంట వ్యవధిలో ఎన్నో గ్రహించానని చెప్పారు. చంద్రబాబులో చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయని అన్నారు. పవన్ కల్యాణ్ తో తనకున్న సంబంధం వేరని ఉండవల్లి పేర్కొన్నారు.