ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి అమలాపురం బయలుదేరిన కావేరీ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే. పెదపూడి వద్ద జరిగింది. సోమవారం తెల్లవారుజామున వేగంగా ప్రయాణిస్తున్న బస్సు, కాలువలోకి దూసుకెళ్లడంతో బస్సులోని పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి వివరాలు సేకరించారు. ప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ వాటిల్లక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రావెల్స్ సిబ్బంది బస్సు నెంబర్ ప్లేట్ల మీద మట్టి పూసి నెంబర్లు కనిపించకుండా చేసే ప్రయత్నం ప్రయాణికులు అరోపించారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ప్రయాణికులు అరోపించారు.
టీఆర్ఎస్ నేతలకు మతి భ్రమించింది: కిషన్ రెడ్డి