ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. మధ్యంతర భృతి పెంచుతూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. 27 శాతం మధ్యంతర భృతి పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిర్ణయంతో సుమారు 4 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. అయితే, రూ.815 కోట్ల మేర ప్రభుత్వానికి అదనపు భారం పడనుంది.
జగన్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తొలి క్యాబినెట్ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని 27 శాతం మేర మధ్యంతర భృతి పెంపుదల చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఈ పెంపు ఈ జూలై నుంచి అమలులోకి వస్తుంది.