telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్.. కొత్తగా 2,932 మందికి పాజిటివ్

Corona

తెలంగాణలో కరోనా వైరస్ చపాకిందనీరులా విస్తరిస్తోంది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,863 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,932 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 11 మంది కరోనాతో మృతి చెందారు. 1580 మంది కోవిడ్ భారినుంచి కోలుకున్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,17,415 కి చేరింది. ఆసుపత్రుల్లో 28,941 మందికి చికిత్స పొందుతున్నారు. 87,675 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 799కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 520 మందికి పాజిటివ్ నిర్దారణ అయింది. 

Related posts